కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.. : పీవీపీ

-

సీని ప్రముఖులు, వైసీపీ నేత పీవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు పీవీపీ. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ హిట్‌ అయిన నేపథ్యంలో ఈ వ్యాక్యలు చేశారు. జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలంటూ తన ట్విట్టర్‌ లో రాసుకొచ్చారు పీవీపీ.

తనకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. అంటూ వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. సినీ ప్రపంచంలో భయపడుతూ బ్రతికే వాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండని పిలుపు నిచ్చారు. అయితే.. పీవీపీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news