అంబానీ, అదాని తర్వాత అత్యంత ధనవంతుడు జగన్ మోహన్ రెడ్డినే – RRR

-

అంబానీ, అదాని తర్వాత అత్యంత ధనవంతుడు జగన్ మోహన్ రెడ్డినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. జగనన్నే మా భవిష్యత్తని ఏడు లక్షల మంది ఆయన సైన్యం రాష్ట్ర ప్రజలతో ఒక్కొక్క అక్షరం పలికిస్తారట. అయితే, జగనన్నే మా విపత్తని రాష్ట్ర ప్రజలందరం ముక్తకంఠంతో నినదిద్దామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు పిలుపునిచ్చారు.

నాలుగు కోట్ల ఒక్క లక్ష మంది రాష్ట్ర ప్రజానీకంలో ఏడు లక్షల మందిని మినహాయించి, మూడు కోట్ల 94 లక్షల మంది ముక్తకంఠంతో జగనన్న నువ్వే మా విపత్తు అని చెప్పేద్దామని ఆయన పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పుకునే ఏడు లక్షల మందికి, ట్విట్ చేసిన విజయసాయి రెడ్డి గారికి మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు అంటూ ఎద్దేవా చేశారు.

తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దీదీకి బోలో అనేది బెంగాల్ లో ప్రజల నుండి వచ్చిన నినాదం అని, దాన్ని కాపీ కొడుతూ, జగనన్నకు చెప్పుకుందాం అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. మమతా బెనర్జీ గారికి, జగన్ మోహన్ రెడ్డి గారికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి ఉంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version