సిగ్గుంటే..వైసీపీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయండి – RRR

-

ఒరేయ్ సన్నాసి అని అన్నావని జగన్ మోహన్ రెడ్డి గారి కంపెనీ అయిన సాక్షి వాడు రాసాడు కదా అనందంగా ! ఆ జగన్ మోహన్ రెడ్డి గారికి తనను పార్టీ నుంచి ఇష్టం లేకపోతె సిగ్గుంటే బహిష్కరించమని చెప్పామన్నారు రఘురామ. నన్ను ఎవరు ఏమి పిక్కునేది లేదని, తాను పార్టీకి, గెలిపించిన ప్రజలకు విధేయుడిగా ఉన్నానని, పడిపోతున్న ఈ పార్టీకి మేలు చేయడానికి నాలుగు మంచి మాటలు చెబుతున్నానని, పార్టీలో వద్దంటే పార్టీ నుంచి తొలగిస్తే వెళ్లిపోవడానికి సిద్ధమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

రుషికొండపై పరిమిత స్థాయిలో తవ్వకాలను జరిపి నిర్మాణాలను చేపట్టేందుకు ఎం ఓ ఈ ఎఫ్ అనుమతించగా, కోర్టులో ఒకవైపు కేసు నడుస్తుండగానే మున్సిపల్, వుడా అధికారులు మాత్రం అరవై ఎకరాలలో నిర్మాణాలకు అనుమతినివ్వడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. మున్సిపల్, వుడా అధికారులు ఇచ్చిన అనుమతులను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, రాజకీయ నాయకుల చెప్పులను నాకడానికి కొంత మంది అధికారులు ఇష్టారీతిలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించారు రఘురామ.

Read more RELATED
Recommended to you

Latest news