రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల ప్రచారం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. నవంబర్ 17న హైదరాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ రేపు ఒక్కరోజే ఏకంగా 5 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు నర్సంపేటలో రాహుల్ గాంధీ ఉండనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకోనున్న రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

Mallikarjun Kharge joins Rahul Gandhi in 'Bharat Jodo Yatra' in Karnataka

పార్టీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారని, పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సమావేశం తర్వాత హైదరాబాద్‌‌ లోనే ఖర్గే బస చేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు తిరిగి ఖర్గే బెంగళూరుకు వెళ్లనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news