Asia Cup 2022 : టీమిండియాకు గుడ్ న్యూస్.. ద్రవిడ్‌ రీ ఎంట్రీ

-

ఆసియా కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా శుభవార్త అందింది. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రావిడ్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు.

జట్టుతో కలిశాడు. దుబాయ్ హోటల్ లో బస చేసిన జట్టు టీమ్ మెంబర్స్ ను అతను ఈ తెల్లవారుజామున కలిసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నెగెటివ్ రిపోర్టు రావడంతో ద్రావిడ్ జట్టును కలిశాడని పేర్కొన్నాయి. పాకిస్తాన్ తో ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆడటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని శుభ సూచకంగా భావిస్తున్నారు. మ్యాచ్ లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ద్రావిడ్ అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version