ముగిసిన రాహుల్ గాంధీ “భారత్ జోడో” యాత్ర

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర రేపు ముగియాల్సి ఉండగా.. ఒకరోజు ముందుగానే ముగించారు. ముగింపు సందర్భంగా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. భారీ సెక్యూరిటీ మధ్య రాహుల్, ప్రియాంక లాల్చౌక్ చేరుకున్నారు. వీరి వెంట జై రామ్ రమేష్ ఉన్నారు.

లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసే సమయంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆ ప్రాంతమంతా భారీకేట్లతో మూసేశారు. అనంతరం లాల్ చౌక్ వద్ద ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర 135 రోజులపాటు 75 జిల్లాలలో, 3,570 కిలోమీటర్ల మేర కొనసాగింది. రేపు శ్రీనగర్ లో బహిరంగ సభ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news