మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన రాహుల్ గాంధీ

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్ర సాగుతోంది. నేడు తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్రప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఇక పాదయాత్ర చేస్తూనే గొల్లపల్లిలో మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడారు రాహుల్ గాంధీ.

ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, జయరాం రమేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం బతుకమ్మ ఆడి ప్రజల్ని ఉత్సాహపరిచారు.  తన పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులు, రైతులు, ప్రొఫెసర్లతో చర్చిస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై ఆయన ప్రొఫెసర్లతో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news