BREAKING : సిరిసిల్లలో రాహుల్ పర్యటన రద్దు

-

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. సిరిసిల్లలో రాహుల్ పర్యటన రద్దు అయింది. ఆగస్ట్ 2 న సిరిసిల్ల నిరుద్యోగ గర్జన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించింది టీపీసీసీ. అయితే తాజాగా సిరిసిల్లలో రాహుల్ పర్యటన రద్దు చేసింది.

ఈడీ విచారణ, వర్షాలు వరదలతో రాహుల్ పర్యటన రద్దు అయినట్లు ప్రకటించింది టీపీసీసీ. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తాం అని స్పష్టం చేసింది టీపీసీసీ. కాగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది.

రాజస్థాన్‌ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్‌ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news