టెన్త్ అర్హతతో రైల్వే జాబ్స్… వివరాలు ఇవే..!

-

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్ ప్యాస్ అయిన వాళ్లకి మంచి అవకాశం. నార్త్ సెంట్రల్ రైల్వే
పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు NCVTకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి గమనించండి. అలానే దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఫిట్టర్ విభాగంలో 286 పోస్టులు, వెల్డర్-11 పోస్టులు, మెకానిక్-84 పోస్టులు, కార్పెంటర్-11 పోస్టులు, ఎలక్ట్రీషియన్-88 పోస్టులు వున్నాయి. ఏప్రిల్ 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు https://www.mponline.gov.in/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

జనరల్ అభ్యర్థులు రూ. 170ని పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లో మినహాయింపు వుంది. పూర్తి సమాచారాన్ని https://ncr.indianrailways.gov.in/ లో చూడచ్చు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news