‘పుష్ప’ అద్భుతమైన చిత్రం..సుకుమార్‌పై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశంసల వర్షం..

-

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’కు జనం ఫిదా అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని చూసి సినీ అభిమానులే కాదు సెలబ్రిటీలు, దర్శకులు, నిర్మాతలు మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ పైన ప్రశంసల వర్షం కు రిపించారు.

 

రాజు హిరానీ..దర్శకుడు సుకుమార్ కు పర్సనల్ గా మెసేజ్ పంపారు. ‘డియర్ సుకుమార్ జీ..ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాల్సింది. కానీ, ఆలస్యంగా చెప్తున్నాను..‘పుష్ప’ సినిమా గురించి నేను నా స్నేహితులతో చాలా కాలం నుంచి చర్చిస్తున్నారు. తాజాగా మహవీర్ తో మాట్లాడగా, ఆయన వద్ద నుంచి మీ నెంబర్ తీసుకున్నా. ‘పుష్ప’ అత్యద్భుతమైన చిత్రం.. మీరు ఇటువంటి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటున్నా.. మీరు ముంబైకి వచ్చినపుడు కలుద్దాం..ఒకసారి వచ్చినపుడు కాల్ చేయండి’ అని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సుకుమార్ కు టెక్స్ట్ మెసేజ్ పంపారు.

ఇక ఈ మెసేజ్ చూసి దర్శకుడు సుకుమార్ ఆనందంగా ఫీలయ్యారు. ‘చిత్ర నిర్మాణంలో మాస్టర్ అయిన మీ వద్ద నుంచి మెప్పు పొందడం నాకు సంతోషంగా ఉంది. రచనలో, సినిమాలో మీరే నాకు స్ఫూర్తి’ అని సుకుమార్ రిప్లయి ఇచ్చారు. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ‘డంకీ’ సినిమా చేస్తున్నారు. సుకుమార్ ‘పుష్ప-2’ తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news