మంత్రి కేటీఆర్ పై పిడి యాక్ట్ కేసులు !

-

కేటీఆర్ పై పిడి ఆక్ట్ పెట్టాలని దేమండ చేశారు రాజసింగ్ భార్య టి ఉష బాయ్. ఈరోజు కేటీఆర్ వల్లే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు జైల్లో ఉన్నారు… ఎంఐఎం పార్టీని మరియు ముస్లిం ఓటు బ్యాంకు ని బుజ్జగించడం కోసమే హిందూ దేవుళ్ళని అవమానపరిచిన మునావర్ ఫారుకీతో కేటీఆర్ కామెడీ షో చేయించారని మండిపడ్డారు. ఆగస్టు 20వ తారీకు ఒక చౌకబారు కమెడియన్ ప్రోగ్రాం కోసం 2000 మంది పోలీసు వారిని వినియోగించి రాజాసింగ్ అభ్యంతరం తెలుపుతున్నా ఈ మునావర్ ఫారుకి కామెడీ షో ని నిర్వహించారు. ఎన్నో న్యాయపరమైనటువంటి కేసులను తన కామెడీ షో లో హిందూ దేవుళ్ళని కించపరచడం ద్వారా మునావర్ ఫారుాఖి ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

ఇతని కామెడీ షో కి చాలా రాష్ట్రాలు అనుమతి నిరాకరిస్తున్నాయి. కానీ హైదరాబాదులో ఈ ప్రోగ్రాం ని కేటీఆర్ అండదండలతో నిర్వహించారు. అంటే కేటీఆర్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో అశాంతిని ప్రేరేపించారు. కాబట్టి కేటీఆర్ పైన పీడీ యాక్ట్ పెట్టి వెంటనే అరెస్టు చేయాలి.
ఇలాంటి చౌకబారు కామెడీ షో నిర్వహించి న కేటీఆర్ పై పోలీసు అధికారులు వెంటనే పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేస్తే ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ పై నమ్మకం ఏర్పడుతుందని వెల్లడించారు.

ఈరోజు రాజాసింగ్ గారిని కుట్రపూరితంగా జైలులో బంధించారు. ఇది కేవలం ఎంఐఎం పార్టీని మరియు ముస్లిం ఓటు బ్యాంకు ని బుజ్జగించేందుకే రాజాసింగ్ ని జైల్లో పెట్టారు. ప్రజల్లో బిజెపి పై పెరుగుతున్న ఆదరణ చూసి కేసిఆర్ కి ఆందోళనచెందారు. అందుకే కేసిఆర్, కేటీఆర్ మరియు ఓవైసీ సోదరులు కలిసి ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. రాజాసింగ్ ఒక హిందుత్వ లీడర్ రాజసింగ్ గారు ఎప్పుడూ హిందుత్వం గురించి మాట్లాడతారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రాజాసింగ్ గారిని హిందువులు ఆదరిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news