దిల్లీ లిక్కర్ స్కామ్​లో మరొకరి అరెస్టు

-

దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ, సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస అరెస్టులు చేస్తూ ఈ కేసులో భాగమైన వారందరిలో వణుకు పుట్టిస్తున్నారు. బుధవారం రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, మరో వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ కేసులో ఈడీ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నగదును ఒకచోట నుంచి మరో చోటుకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చినట్లు వెల్లడించారు.

ఇటీవల ఈడీ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది పేర్లను ప్రస్తావించారు. ఇప్పటికే అరెస్టయిన ముగ్గురూ ఈ జాబితాలోని వారే. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుల జాబితా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జాబితాలో ఉన్న మిగతా వారి భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news