రజనీకాంత్‌కు ఆపరేషన్.. ప్రధాని మోడీ ఆరా!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రిలో చేరగా ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆరా తీస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సైతం రజినీకాంత్ భార్య లతాతో ఫోన్‌లో మాట్లాడి..ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ‘X’ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్న వారిలో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ..హీరోలు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. రజినీకాంత్ హృదయం నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు రాగా..మంగళవారం సాయంత్రం చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో..ట్రాన్స్ కాథెటర్ ట్రీట్మెంట్ చేసి స్టంట్ వేసినట్లు వైద్యులు తెలిపారు.మరో రెండ్రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం రజీనికాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version