ఐపీఎల్ : ఢిల్లీ కేపిటల్స్ పై విజయం అందుకున్న రాజస్తాన్ రాయల్స్..

-

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ చాలా రసవత్తరంగా అనిపించింది. ఢిల్లీ కేపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య చాలా ఉద్విగ్నభరితంగా కొనసాగింది. 148పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు టప టపా వికెట్లు వదిలేసుకుని, చివరి ఓవర్ వరకూ గెలుస్తుందా లేదా అన్న సందేహాల నడుమ అభిమానులకి గుండెపోటు వచ్చేంత టెన్షన్ పెట్టి, చివర్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. రెండు బంతులు మిగిలి ఉండగానే 7వికెట్లు కోల్పోయి 150పరుగులు చేయగలిగింది.

రాజస్తాన్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు విఫలమవడంతో మిడిల్ ఆర్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఒక్కడే జట్టుకి నమ్మకాన్ని అందించాడు. చివర్లో క్రిస్ మోరిస్ తనదైన ఆటతో రాజస్తాన్ రాయల్స్ కి మర్చిపోలేని గెలుపు అందించాడు. స్కోరు బోర్డ్ విషయానికి వస్తే, డేవిడ్ మిల్లర్ 61పరుగులు ( 43 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), క్రిస్ మోరిస్ 36పరుగులు (18బంతుల్లో 4ఫోర్లు) చేసారు. ఢిల్లీ బౌలర్లలో ఢిల్లీ బౌలర్లలో అన్వేషి ఖాన్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, రబాడ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news