లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : దాన్ని భారీగా తగ్గించిన రకుల్‌..!

-

లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్ లు జరగకపోవడంతో.. సినిమాలపై ఆధారపడి బతికేవారు ఇన్ని రోజులు పనులు లేక ఇబ్బందులు పడ్డారు. నిర్మాతలకు సైతం కోట్లలో నష్టాలు వచ్చాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. దీంతో సీని నటులు కొందరు తమ రెమ్యునరేషన్స్ తగ్గించి నిర్మాతలపై భారాన్ని తగ్గిస్తున్నారు.

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆఫర్ల కోసం ఎదురు చూస్తు తన రెమ్యునరేషన్‌ను కూడా తగ్గించింది. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఒకప్పుడు సినిమాకు కోటిన్నర రెమ్యునరేషన్‌ తీసుకున్న రకుల్ ఇప్పుడు అందులో సగం ఇచ్చినా నటించేందుకు సై అంటున్నట్లు తెలుస్తుంది. అయినా కూడా అవకాశాలు రావడం కష్టంగానే మారుతుందిప్పుడు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది రకుల్.

Read more RELATED
Recommended to you

Latest news