చిరంజీవికి కరోనా.. “గుడ్ లక్ సఖి” కోసం రామ్ చరణ్ ఎంట్రీ!

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ కీర్తి మెయిన్‌ రోల్‌ లో నటించిన తాజాగా చిత్రం “గుడ్ లక్ సఖీ”. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ గా ఉంది. అలాగే.. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ “గుడ్ లక్ సఖీ” సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇవాళ జరుగనుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు స్పెషల్‌ గెస్ట్‌ గా మెగాస్టార్‌ చిరంజీవి రావాల్సి ఉంది. అయితే.. ఆయనకు ఇవాళ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

దీంతో.. మెగాస్టార్‌ చిరంజీవి స్థానంలో.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రానున్నారు. ఈ మేరకు “గుడ్ లక్ సఖీ” చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. దీంతో “గుడ్ లక్ సఖీ” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. కాగా..అయితే తాజాగా గుడ్‌ లఖ్‌ సఖి మూవీ ట్రైలర్‌ విడుదలైంది. పుట్టుకతోనే బ్యాడ్‌ లక్‌ ను వెంటేసుకు తిరుగుతున్న ఓపల్లె టూరి అమ్మాయి.. స్టార్‌ షూటర్‌ గా ఎలా ఎదిగిందనేది కథ. దాదాపు కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేశారు. ఇది ఇలా ఉండగా.. ఈ మూవీ ఈ నెల 28 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news