జీ20 సదస్సులో వేదికపై తన మనోభావాలను పంచుకున్న రామ్‌చరణ్‌

-

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొననున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన అనంతరం టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో ఆయన అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ అవుతారు. కాగా వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

G20 Summit: RamCharan in love with Kashmir | cinejosh.com

1986 నుంచి తాను కశ్మీర్ కు వస్తుండేవాడ్నని రామ్ చరణ్ వెల్లడించారు. ఇక్కడి గుల్ మార్గ్, సోనా మార్గ్ లోని అనేక అందమైన లొకేషన్లలో తన తండ్రి చిరంజీవి అనేక చిత్రాలు షూటింగ్ జరిపేవారని గుర్తుచేసుకున్నారు. తాను కూడా 2016లో ఇక్కడ ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నానని రామ్ చరణ్ తెలిపారు. కశ్మీర్ సోయగాలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news