బీజేపీకి పవన్ ను దూరం చేసేందుకు..ఏపీలో కేసీఆర్ కుట్రలు – విజయశాంతి

-

బీజేపీకి పవన్ ను దూరం చేసేందుకు..ఏపీలో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆరెస్ రూపంలో కేసీఆర్ గారు చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆరెస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ గారు పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని మండిపడ్డారు విజయశాంతి.

ఏది ఏమైనా ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బిజెపికి దూరం చేయటానికి కెసిఆర్ గారు బిఆర్ఎస్ పేరుతో చేస్తున్న దుష్ప్రయత్నాన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆరెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ట్వీట్‌ చేశారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news