వాళ్ల ఆనందాన్ని దగ్గరుండి చూశా.. మర్చిపోలేని విజయం ఇది : రణ్‌బీర్‌కపూర్‌

-

ఈ విశ్వంలో ప్రేమను మించిన బలమైన శక్తిలేని చెబుతూ విజువల్ వండర్ గా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్రం. విడుదలైన మూడ్రోజుల్లోనే రూ.150 కోట్లు సంపాదించింది. రియల్ లైఫ్ కపుల్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ‘బ్రహ్మాస్త్రం’ చిత్రానికి పెరుగుతున్న ప్రేక్షకాదరణపై  కథానాయకుడు రణ్‌బీర్‌కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకులతో కలిసి చూస్తూ, ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు.

‘‘విడుదలైనప్పటి నుంచి బ్రహ్మాస్త్రం చూస్తూనే ఉన్నా. ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా థియేటర్‌లో మాకు దగ్గరగా కూర్చున్న ఇద్దరు పిల్లలు సినిమా చూస్తున్నంత సేపు కేరింతలు కొడుతూనే ఉన్నారు. ప్రారంభం నుంచి చివరివరకు వాళ్లిద్దరూ నిలబడే సినిమా చూశారు. మళ్లీ థియేటర్లు నిండుకోవడం, ప్రేక్షకుల సందడి చేయడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా  ఉంది. ఒక సినిమా ఇంత ఆనందాన్నివ్వడం నా జీవితంలో ఇదే తొలిసారి. దీనంతటికి కారణం ఈ చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ . ‘బ్రహ్మాస్త్రం’తో అతను అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. సినిమాపై అతనికున్న తపనకు నిదర్శనం ఇది. బ్రహ్మాస్త్రంను విజయవంతం చేస్తోన్న ప్రేక్షకులకు మా కృతజ్ఞతలు’ అంటూ భావోద్వేగం చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news