తల్లిదండ్రుల వద్దకు చేరుస్తానని నమ్మించి అత్యాచారం… ఇంట్లో పనిచేసే బాలికపై ఘాతుకం

-

పోక్సో వంటి కఠిన చట్టాలు వచ్చినా పిల్లలపై అత్యాాచారాలు ఆగడం లేదు. రోజుకు దేశంలో ఎక్కడో ఓ చోట బాలికలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 14 గిరిజన ఏళ్ల బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రల వద్ద దించుతా అని బాలికను కిడ్నాప్ చేసిన కీచకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. భీవండీ తాలూకాలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

rape

పూర్తి వివరాల్లోకి వెళితే పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఇటుక బట్టీలో పనిచేస్తుంటారు. అయితే తెలిసిన వ్యక్తి ఇంట్లో పని కోసం వారి కూతురును భీవండికి పంపించారు. కొన్ని రోజులు పనిచేసిన తర్వాత సదరు బాలిక తనను తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని యజమానికి కోరింది. దీంతో ఇద్దరు బైక్ పై పాల్ఘర్ కు బయలు దేరారు. మార్గం మధ్యలో బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అరవడానికి ప్రయత్నించిన బాలికను తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశాడు. ఘటన గురించి ఎవరికి చెప్పవద్దని హెచ్చిరించాడు. ఆ తర్వాత బాలికను తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఓ ఎన్ జీ ఓ సహాయంతో నిందితుడిపై పోలీసుకలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. బాధితురాలిని భీవండీలోని బాలల గృహానికి తరలించారు.

.

Read more RELATED
Recommended to you

Latest news