రష్మీ – సౌమ్య: బుల్లితెర యాంకర్ల మధ్య బయటపడ్డ విభేదాలు..!!

-

తాజాగా సౌమ్యరావు శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్ కి యాంకర్ గా హాజరవగా.  ఈ వేదికపై రష్మీ – సౌమ్య ఎదురుపడ్డారు.  ఎవరు గొప్పో తేల్చుకున్నారు.. ఏ రంగంలో అయినా సరే మన ఆధిపత్యానికి గండి కొట్టడానికి ఎవరైనా వస్తే ఎవరు కూడా సహించరు.  అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ లో దిగ్విజయంగా కొనసాగుతున్న యాంకర్ రష్మీకి పోటీగా సౌమ్యరావు రావడంతో విభేదాలు కలుగుతున్నాయి అనే ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది. అనసూయ జబర్దస్త్ మానేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిర్మాతలు కొత్త యాంకర్ ని తీసుకురాకుండా ఆ బాధ్యతలు రష్మీకి అప్పగించారు. కానీ జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించేసరికి ఈమెకు త్రిబుల్ రేమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది.
అయితే తాజాగా రష్మి సంపాదనకు సౌమ్యారావు గండి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి, ప్రజెంటర్ సౌమ్యరావును యాంకర్ గా తీసుకొచ్చారు.  సౌమ్యరావు రావడం పై మీ అభిప్రాయం ఏమిటి అని రష్మీ ని అడగగా.. నాకు ముందే చెప్పారు. కాబట్టి నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అని చెప్పింది.  కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే ఎక్కడో తన ప్లేస్ లాగేసుకుందని అసహనం రష్మీ లో కనబడుతోంది. తాజాగా వీరిద్దరూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు గొప్పో తేల్చుకున్నారు . “కొత్త యాంకర్ రాగానే వెళ్లిపోవడానికి నేనేమన్నా ఆ పాత ముగ్గురు యాంకర్స్ అనుకుంటున్నావా..? ” అని రష్మీ సౌమ్యరావుతో అనగానే సౌమ్యరావు వెంటనే రష్మికి పంచ్ వేసింది.
పాత యాంకర్లు ముగ్గురు కాదు.. నీతో కలిపి నలుగురు అంటూ షాక్ ఇచ్చింది. అనసూయతోపాటు వర్షిని, సమీరా కూడా జబర్దస్త్ యాంకర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ లిస్టులోకి రష్మీని చేర్చి సౌమ్యరావు అలా చెప్పేసింది. దీంతో రంగంలోకి దిగిన ఇంద్రజ ఎవరు గొప్పో మీరిద్దరూ నిరూపించాలి అని చెప్పడంతో ఇంద్రజను మెప్పించడం కోసం సౌమ్యరావు,  రష్మి అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
https://youtu.be/RYUtJ7kQgPM?t=31

Read more RELATED
Recommended to you

Latest news