రష్మిక మందన న్యూ అవతార్.. స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేయబోతున్న క్యూట్ బ్యూటీ..

-

క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన.. ప్రజెంట్ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఫుల్ పాపులర్ అయిన ఈ భామ ప్రజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ వెళ్లింది. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ భామ మరో న్యూ అవతార్ లో కనిపించబోతుందట. స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నదని తెలుస్తోంది.

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ చేసేందుకు సెపరేట్ గా గాళ్స్ ఉండేవారు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ సమంత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా..’ సాంగ్ చేయగా, రెజీనా కసాండ్రా.. ‘ఆచార్య’ చిత్రంలో ‘చానా కష్టం వచ్చేసింది మందాకిని’ సాంగ్ లో కనిపించింది. కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, పూజా హెగ్డే ఇంకా తదితర యంగ్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ కు ఓకే చెప్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక మందన కూడా ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పేసిందని వినికిడి.

ఒకే ఒక సినిమా ‘అర్జున్ రెడ్డి’ తో బాలీవుడ్ లో పాగా వేసేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రజెంట్ ఆయన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ‘యానిమల్’ చిత్రం చేస్తు్న్నాడు. ఈ పిక్చర్ లో ఐటెం సాంగ్ చేయడానికి స్కోప్ ఉండగా, దానికి రష్మిక మందననే కావాలని ‘యానిమల్’ మూవీ మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్.

క్యూట్ బ్యూటీ రష్మిక మందన స్పెషల్ సాంగ్ లోనూ ఇరగదీస్తుందని ఈ సందర్భంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో ‘శ్రీవల్లి’గా రష్మిక మందన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. చూడాలి మరి.. రష్మిక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో..

 

Read more RELATED
Recommended to you

Latest news