సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రవీందర్ సింగ్

-

సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. ఈ కార్యక్రమానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. తనకి ఇంతటి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉంటానని అన్నారు. మంత్రి గంగులతో కలిసి పనిచేసి సివిల్ సప్లై కార్పోరేషన్ కి మంచి పేరు తెస్తానన్నారు రవీందర్ సింగ్.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 1600 రైస్ మిల్లులో ఉంటే నేడు వాటి సంఖ్య 2600 కు పైగా రాష్ట్రంలో రైస్ మిల్లులు పెరిగాయన్నారు. వరి ధాన్యం కోటి టన్నులు పండుతుందని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. పంజాబ్ రాష్ట్రం కంటే కూడా తెలంగాణలో అధికంగా వరి ధాన్యం పండుతుందన్నారు రవీందర్ సింగ్. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమంలా చేస్తున్నారని.. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైస్ మిల్లులో 100 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news