కీలక వడ్డీ రేట్లు యధాతథం… రిజర్వ్ బ్యాంకు ప్రకటన

-

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ ను వెల్లడించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఓమిక్రాన్ వేళ ఆర్బీఐ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయిన దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు ఆర్బీఐ. రెపోరేటు, రివర్స్ రెపోరేట్లను యధాతథంగా ఉంచారు. రెపో రేటను 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా ఉంచానలి మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని శక్తికాంతదాస్ వెల్లడించారు.

వరసగా తొమ్మిదో సారి కూడా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మార్చకుండా.. యధాతథంగా ఉంచారు. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించడం వల్ల.. వాటి డిమాండ్ పెరిగిందని శక్తికాంతదాస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కోవిడ్ సంక్షోభాన్ని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నమాని ఆయన వెల్లడించారు. 2022 వార్షిక సంవత్సరం నాటకి జీడీపీలో వృద్ధి రేటు టార్గెట్ 9.5 శాతంగా ఉన్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌డం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోకి వ‌స్తుంద‌న్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news