బీజేపీ, టిఆర్ఎస్ తోడుదొంగలు, కవల పిల్లల లాంటి వారే – మాజీ కేంద్ర మంత్రి

-

బీజేపీ విషయంలో టిఆర్ఎస్ యూ టర్న్ తీసుకుందని…బీజేపీ, టిఆర్ఎస్ తోడుదొంగలు ,కవల పిల్లల లాంటి వారని ఆగ్రహించారు రేణుక చౌదరి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది.లైసెన్స్ లు ఇస్తుంది..ఎక్సైజ్ శాఖ కాదా ? బీజేపీ మరోమతాన్ని కించరపరచడం సరైంది కాదని మండిపడ్డారు. సనాతన ధర్మం బీజేపీ కి తెలుసా…ప్రపంచం ముందు సిగ్గుపడేలా బీజేపీ నేతల వ్యవహారం ఉందన్నారు. పసి పిల్లలకు కూడా తెలంగాణలో రక్షణ లేదనీ…రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళల పై అఘాయిత్యం జరిగిందని మండిపడ్డారు. పోలీసుల లెక్కల చూస్తే..మహిళలల పై రేప్ కేసులు పెరిగాయి..ఇదేనా బంగారు తెలంగాణ అంటే…అని ప్రశ్నించారు.

పసి పిల్లలకు కూడా తెలంగాణలో రక్షణ లేదు.జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారన్నారు. వేల కేసులు నమోదయితే..46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడింది…మైనర్ బాలిక వీడియో ల్ను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు దోషే అని స్పష్టం చేశారు. రఘునంధన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు..రఘునంధన్ రావు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటె…రఘునంధన్ రావు బయట పెట్టాలి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు వదిలేది లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news