వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు – రేవంత్ రెడ్డి

-

వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని…భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని వివరించారు.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని… పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదని ఆగ్రహించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు…దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? అని ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని.. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందన్నారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని… కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని కోరారు రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Latest news