ఉమ్మడి వరంగల్ లో రేవంత్ రెడ్డి … కాంగ్రెస్ లోకి గండ్ర చేరిక

-

రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత పలువురు నాయకుల చేరికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఛరిష్మా ఉన్న నేతలను కాంగ్రెస్లోకి చేర్చుకుని మరింత బలపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. భూపాలపల్లి జిల్లాలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న గండ్ర సత్యనారాయణ రావు అతని అనుచరులతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్న గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో గండ్ర సత్యనారాయణ రావు ఓడిపోయారు. తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి సొంత నియోజకవర్గం అయిన భూపాలపల్లిలో గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. గత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ రావు గట్టిపోటీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ లో కీలక నేతగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news