యువత ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ఎన్నికల సందర్భముగా ప్రచారాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరమగా మారుస్తున్నారు. ఈ రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి రెడ్డిపేట్ లో ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువత కలలపై కేసీఆర్ నీళ్లు చల్లారంటూ విమర్శలు చేశారు. ఎన్నో ఆశలతో చదువుకుని తీరా ఉద్యోగాలు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఎందరో యువకులు మరియు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ఇంక చనిపోయిన వారిని సైతం BRS నేతలు పరామర్శించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు అంటూ రేవంత్ బాధపడ్డారు.

అందుకే మీ ఆశలు తీర్చని BRS ను పక్కన పెట్టి కాంగ్రెస్ ను గెలిపించండి ఒక్క ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలిస్తాము అంటూ చెప్పారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news