కామారెడ్డిలో రైతు ఆత్మహత్య…ఫోన్‌ చేసి మాట్లాడిన రేవంత్‌ !

-

రైతు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో రేవంత్‌ రెడ్డి చేత మాట్లాడించారు. ఈ సందర్భంగా బీరయ్య కొడుకు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు రేవంత్‌ రెడ్డి. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లో రైతులు అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news