నేటి గాంధీ మరో ఉస్మానియానే…?

-

గాంధీ ఆస్పత్రికి వెళ్ళిన కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్ లు చేసారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి 16 వేలకు పెంచాలి అని ఆయన కోరారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్ ను ఇంత వరకు అతీగతీ లేదు అని ఈ సందర్భంగా ఆరోపించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి అని డిమాండ్ చేసారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలి అని కోరారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యల పై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలి అని సూచించారు. కోవిడ్ తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలి అన్నారు. గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అర చేతిలో వైకుంఠం చూపించారు అని ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news