డబుల్ ఇంజిన్‌కు కొత్త అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజామాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని అదానీ, అంబానీలకు దోచి పెడ్తున్నారని పేర్కొన్నారు. హిడెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అదానీకి సపోర్ట్ గా ఉందని, అందుకే ఇన్నీ ఆరోపణలు వచ్చినా అదానీ సంస్థలపై విచారణ జరిపించడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో కూడా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.

అదానీ షేర్ విలువలు పెంచుతూ పెట్టుబడులు పెట్టించారు. తర్వాత అదానీ ఇచ్చిన ముుడపులను విదేశాలకు తరలించారని పేర్కొన్నారు. రాఫెల్ కాంట్రాక్టులు, పోర్టులన్నీ అదానీ, అంబానీ సంస్థలకే కట్టుబెడుతున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో కేంద్రం చెప్పాలని కోరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఇంలాంటి ఆరోపణలు వస్తే జేపీసీలు వేశామని గుర్తుచేశారు ఆయన. అదానీ, ప్రధానీ వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని అన్నారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వంలో యూనివర్సీటీలకు, ప్రాజెక్టులకు చేసిందేంలేదని రేవంత్ విమర్శించారు. వాళ్లు చేసిందల్లా 3000 బెల్టు షాపులు, 30,000 వైన్ షాపులేనని హేళన చేశారు. పేపర్ లీక్ లకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలను బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news