ప్ర‌ధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ‌

-

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బ‌హిరంగ‌ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులలో నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెనక్కు తీసుకోవాలని ఈ లేఖ‌లో ప్రధాని న‌రేంద్ర మోడీని కోరారు రేవంత్ రెడ్డి. బొగ్గు విక్రయం కోసం బొగ్గు గనుల వేలం కోసం 3వ విడతలో సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని భారత ప్రభుత్వం బొగ్గు మంత్రిత్వ శాఖ (MoC) ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్ర‌ధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లారు రేవంత్ రెడ్డి.

అక్టోబర్‌లో, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక పవర్ ప్లాంట్లు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయని… కానీ తెలంగాణలోని థర్మల్ పవర్ ప్లాంట్‌లలో అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు ఉన్నాయని వెల్ల‌డించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నుండి తగినంత బొగ్గు సరఫరా కారణంగా మాత్రమే ఇది సాధ్యమైందని… SCCL అనేది 51:49 ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం యొక్క జాయింట్ వెంచర్ అని గుర్తు చేశారు. ఇది ఇప్పుడు 45 గనుల నుండి బొగ్గును ఉత్పత్తి చేస్తోంది మరియు 1200 MW (2X600) MW పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోందన్నారు. కాబ‌ట్టి సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బొగ్గు గనుల బ్లాకులను వేలం వేయాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. వాటిని SCCLకి కేటాయించాలని లేఖ‌లో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news