సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎం.పీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలని ఈ లేఖలో పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి. పంటల బీమా అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

revanth-reddy-cm-kcr

కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుడ్ సబ్సిడీ ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు. తదుపరి పంటల నుంచి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్న రేవంత్‌ రెడ్డి తక్షణమే రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ మరిచిందని చురకలు అంటించారు. ఇప్పటికైనా.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news