రాహుల్ గాంధీతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి, నల్లాల ఓదెలు

-

టిఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు షాకిచ్చారు. టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నల్లాల ఓదెలు నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై ఢిల్లీ వెళ్లిన ఓదేలు.. మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఓదేలును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు ఢిల్లీకి తీసుకుని వెళ్లారు.

అయితే టిఆర్ఎస్ పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరుతో ఆ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గులాబీ నేతల మధ్య ఆధిపత్య పోరు తో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు, నల్లాల ఓదేలు మధ్య ఆధిపత్య పోరు ఉందన్నమాట తెలిసిందే. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news