టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

-

నిన్న జరిగిన వెస్టిండీస్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఇండియన్ కెప్టెన్ గా రికార్డులకు ఎక్కాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ కు ముందు మ్యాచ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ 59 సిక్సర్లతో సమానంగా ఉన్నారు.

తాజా మ్యాచ్ లో అలర్జీ బౌలింగ్ లో శిక్ష బాధ్యత రోహిత్ శర్మ కోహ్లీ నీ దాటేసి టి20 లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. కాగా నిన్న రాత్రి జరిగిన మూడో టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు పై గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు.కేవలం 44 బంతుల్లోనే 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news