చంద్రబాబు పాలనలోనే నారకాసుర ఆంధ్ర ప్రదేశ్‌ గా మారింది – మంత్రి రోజా

-

చంద్రబాబు పాలనలోనే నారకాసుర ఆంధ్ర ప్రదేశ్‌ గా మారిందని.. .మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. గత ప్రభుత్వం హాయం లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని… సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా,వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. రూ. 1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారని.. సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్ గా అనిపించింది కాబట్టే చంద్రబాబు దించి జగన్మోహన్ రెడ్డి నీ అధికారం కట్టబెట్టారని.. చురకలు అంటించారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గిందని.. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కటిన శిక్ష విధిస్తున్నారని పేర్కొన్నారు.

మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తోందని.. బాదుడే బాదుడు..అంటూ వ్యాట్, విద్యుత్ ఛార్జీలు పెంచలేదా చంద్రబాబు ప్రశ్నించారు మంత్రి రోజా. ఆర్టీసి ని ప్రవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసి నీ ప్రభుత్వం లో విలీనం చేశారని… డిస్కంలు కు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆగ్రహించారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలు పెంచారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news