చంద్రబాబు తీరుతో.. ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోంది : రోజా సంచలనం

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై అసెంబ్లీలో వైసీపీ నగరి ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ప్రవర్తనతో పైన ఉన్న ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అని ఆమె విమర్శించారు. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే.. జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి నేతలు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం ఇంటింటికీ నీళ్లు ఇచ్చిందో లేదో కానీ ఇక్కడ మాత్రం ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు. ఎనీ టైం మందు దొరికేలా చంద్రబాబు పాలన కొనసాగుతుందని… నిషేధం ఎత్తివేసిన మద్యపానాన్ని ఏరులై పారించారని నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వంలో మద్యపాన నిషేధం దిశగా చర్యలు ఉన్నాయని ఆమె వివరించారు.

మద్యం కమిషన్ల కోసం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారని.. ప్రభుత్వం నుంచి దిగిపోయే ముందు బార్లకు లైసెన్సులిచ్చారని ఆగ్రహించారు. ప్రశ్నోత్తరాలు జరగ్గకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోంది… వాళ్లే ప్రశ్నలు వేస్తున్నారు.. వాళ్లే అడ్డుకుంటున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news