IPL 2022 : రాజస్థాన్‌ పై 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం

-

రాజస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం గ్రాండ్‌ విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ.. రాణించిన బెంగళూరు జట్టు.. విజయం సాధించింది. మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ జట్టు..20 ఓవర్లలో…3 వికెట్లు కోల్పోయి.. ఏకంగా 169 పరుగులు చేసింది.

రాజస్థాన్‌ ఓపెనర్‌… జాస్‌ బెట్లర్‌ 70 పరుగులు, పడిక్కల్‌ 37 పరుగులు, హేట్‌ మేయిర్‌ 42 పరుగులు చేసి.. జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. బౌలింగ్‌ లో హర్షల్‌ పటేల్‌ 1, విల్లే 1, హసరంగ 1 వికెట్ పడగొట్టారు.

ఇక ఛేజింగ్‌ కు వచ్చిన .. బెంగళూరు 19.1 ఓవర్ల లో ఏకంగా 6 వికెట్లు కోల్పోయి.. 173 పరుగులు రాబట్టి, విజయం సాధించింది. కెప్టెన్‌ డూప్లిసెస్‌ 29 పరుగులు, రావత్‌ 26 పరుగులు, అహ్మద్‌ 45 పరుగులు, కార్తీక్‌ 44 పరుగులు చేసి… జట్టుకు విజయాన్ని అంధించారు. మొదట్లో తడబడ్డా…. దినేష్‌ కార్తీక్‌, అహ్మద్‌ చెలరేగడంతో… బెంగళూరు విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news