నువ్వు మా నమ్మకం కాదు… నమ్మక ద్రోహివి – జగన్‌ పై RRR సీరియస్‌

-

సీఎం జగన్‌ పై రఘురామ రాజు సీరియస్‌ అయ్యారు. నువ్వు మా నమ్మకం కాదు… నమ్మక ద్రోహివి జగన్ అంటూ…ఆగ్రహించారు రఘురామ. ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తుండడం వల్ల రాష్ట్రంలో అమ్ముడుపోని దిష్టి బొమ్మలు…అంటూ ఆగ్రహించారు. తనని తాను అతిగా ప్రేమించుకోవడం అనేది ఒక మానసిక రుగ్మత అని, ఆ జబ్బు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుందని, అందుకే ఎక్కడ చూసినా చిక్కటి చిరునవ్వు చిందించే ఆయన ఫోటో ఉండాలని భావిస్తున్నారని అన్నారు.

ఈ రకమైన మానసిక రుగ్మతను నార్సిసిజం అని అంటారని, ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోతో పాటు, ఉదయిస్తున్న సూర్యుడిలా జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటోలు ముద్రించేవారని, కానీ కాలక్రమేనా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలు అస్తమించిన సూర్యుడిలా కనుమరుగయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ప్రకటనల్లోనూ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కనిపించకుండా పోయిందని, కేవలం ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రమే ముద్రిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news