ఐపిఎల్ లో నేడు “డబుల్ ధమాకా”!

-

ఐపిఎల్ 2023 లో మ్యాచ్ లు మొదలయ్యి అప్పుడే సరిగ్గా పది రోజులు కావస్తోంది. ప్రతి మ్యాచ్ లోనూ ప్రేక్షకులకు కావాల్సిన క్రికెట్ వినోదాన్ని మన దనాదన్ లీగ్ పంచుతోంది. కాగా ఈ ఐపిఎల్ ను కొన్ని జట్లు విజయాలతో ప్రారంభించగా ఇంకా కొన్ని జట్లు విజయం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాయి. వాటిలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. ఈ సారి కాంపిటీషన్ ఏమంత ఈజీ గా లేదు. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే గట్టి పోటీ తప్పేలా లేదు.

కాగా ఈ రోజు ఆదివారం కావున డబుల్ ధమాకా జరగనుంది. మధ్యాహ్న 3.30 గంటలకు జరిగే మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ లు అహమదాబాధ్ వేదికగా తలపడనున్నాయి, ఇందులో ఫేవరేట్ కోల్కతా అని చెప్పాలి. ఇక రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ లు వేదికగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం లో తలపడనున్నాయి. మరి చూద్దాం ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుపొందనున్నారో ?

Read more RELATED
Recommended to you

Latest news