తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు, వ్యవసాయ అధికారులు ఇతరులు అందరూ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చిస్తోంది. అలాగే మే నెల 20వ తేదీ నుండి జూన్ 5 వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కేంద్రంపై పోరుకు ఎలాంటి కెసిఆర్ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటారో నని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందా ? లేక మిల్లర్లతో ప్రభుత్వమే కొనుగోలు చూపిస్తుందా ? అనే దానిపై ఇవాళ సాయంత్రం కీలక ప్రకటన రానుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో 5:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు.