వివాదాస్పద ఆటగాడు శ్రీశాంత్ సంచలన నిర్ణయం

-

టీమిండియా మాజీ బౌలర్ శాంతకుమారన్ శ్రీశాంత్..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే.. తాజాగా శాంతకుమారన్ శ్రీశాంత్.. త్వరలో మరో కొత్త ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అబూదాబి టీ10 లీగ్ నుంచి మెంటర్ గా కెరీర్ ను ప్రారంభించనున్నాడు. బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ సారథ్యం వహించనున్న బంగ్లా టైగర్స్ కు శ్రీశాంత్ తన సేవలందించనున్నాడు.

ఈ జట్టుకు హెడ్ కోచ్ గా బంగ్లా మాజీ ఆల్ రౌండర్ ఆఫ్తాబ్ అహ్మద్ వ్యవహరించనుండగా, అదే దేశానికి చెందిన నజ్ముల్ అబేదిన్ ఫహీమ్ అసిస్టెంట్ కోచ్ గా పని చేయనున్నాడు. ఈ ఇద్దరితో కలిసి శ్రీశాంత్ కోచింగ్ టీమ్ లో ఉంటాడని బంగ్లా టైగర్స్ యాజమాన్యం తాజాగా వెల్లడించింది. కాగా టీమిండియా మాజీ బౌలర్, వివాదాస్పద ఆటగాడు శాంతకుమారన్ శ్రీశాంత్.. గతంలో మ్యాచ్‌ పిక్స్ంగ్‌ ఘటనలో నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీశాంత్‌ కౌంటీ, రంజీ ట్రోఫిల్లోనే ఆడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news