గవర్నర్‌తో మంత్రి సబిత, విద్యాశాఖ అధికారుల భేటీ

-

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బిల్లుపై సందేహాలు నివృత్తి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం మంత్రికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు గవర్నర్ ను కలిసేందుకు రావొచ్చని రాజ్ భవన్ సందేశం పంపింది.

ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసేందుకు తమిళిసైతో భేటీ అయ్యారు బిల్లుపై చర్చలు జరుపుతున్నారు. మరికాసేపట్లో వర్సిటీల ఉమ్మడి నియామకాల బిల్లుపై నిర్ణయం వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news