అడవి శేష్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న సాయి మంజ్రేకర్..కారణం..?

-

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్. 1998 ఆగస్టు 29వ తేదీన జన్మించిన ఈ ముద్దుగుమ్మ దబాంగ్ త్రీ అనే చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక తన తండ్రి ప్రోత్సాహంతోనే సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకొని మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈమె తెలుగులో హీరో అడవి శేష్ నటించబోతున్న మేజర్ సినిమా లో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అయితే ఇది వరకే వరుణ్ తేజ్ సరసన గని సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది కానీ సాయి మంజ్రేకర్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను అలరించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే సందీప్ ఉన్నికృష్ణన్ తన జీవితంలో ఎలా జీవించారు అనే కథాంశంతో తెరకెక్కుతున్న మేజర్ సినిమా లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా .. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక మహేష్ బాబు బ్యాక్ బోన్ గా నిలబడి ఈ సినిమాను చిత్రీకరించడం గమనార్హం. మహేష్ బాబు ఈ సినిమాకు ప్రముఖ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 26/11 తీవ్రవాదుల దాడుల నుంచి ప్రజలను ఎలా క్షేమంగా రక్షించారు.. ప్రాణాలు కోల్పోయిన ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆలీతో సరదాగా షోకి హాజరైన అడవి శేష్ అలాగే సాయి మంజ్రేకర్ కొన్ని వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

ఇక ఈ క్రమంలోనే సాయి మంజ్రేకర్ అడవిశేష్ గురించి మాట్లాడుతూ.. చాలా జోవియల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్.. అడవి శేష్ తో పనిచేయడం చాలా సరదాగా అనిపిస్తుంది .మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ అతని పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news