చైతూ ని మర్చిపోలేక పోతున్న సమంత.. అందుకే అలా.!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య , సమంత అనుకోకుండా 2021 అక్టోబర్ 2వ తేదీన విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే సినీ పరిశ్రమ లోకి ఏ మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత ఒక్కొక హీరోతో ఒక్కొక్క రకమైన సినిమా చేస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళింది. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నాగచైతన్య ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చింది.


విడాకుల తర్వాత అధికంగా సినిమాల మీద దృష్టి పెట్టి ఎక్కువగా వర్కౌంట్స్ చేయడం, నాగచైతన్యను మర్చిపోలేక డిప్రెషన్ లోకి వెళ్లడం వల్లే మయో సిటీస్ అనే వ్యాధిబారిన పడింది. ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మరోవైపు ఈమె నటించిన శాకుంతలం సినిమా కూడా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం గుడ్ న్యూస్ తెలిపారు. ప్రస్తుతం సమంత చేతిలో ఖుషీ సినిమా మాత్రమే ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. పూర్తిగా వ్యాధి నుంచి బయటపడితేనే ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుంది.

ఇదిలా వుండగా నాగచైతన్య ను సమంత ఇంకా మరిచిపోయినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఈమె పెట్టే పోస్టులను చూస్తే అదే అనిపిస్తుంది ఇంతకీ సమంత ఏం పోస్ట్ పెట్టిందంటే.. “నా లైఫ్ మునిపటిలా లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ సమంత.. నాగచైతన్యను మరిచిపోలేకపోతోందా ? అనవసరంగా విడాకులు తీసుకున్నామనే భావన ఆమెలో కలుగుతోందా? అంటూ నెటిజన్లు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సమంతా నిజంగా నాగచైతన్యను మర్చిపోలేక పోతే.. మళ్ళీ ఒక్కటైతే బాగుండు అని కూడా కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news