నేటి నుంచి 1 వరకు ‘సమతామూర్తి’ సందర్శన నిలిపివేత

-

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం లో భక్తుల సందర్శన కు బ్రేక్ పడింది. ఈనెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు సమతా మూర్తి సందర్శన నిలిపివేస్తున్నట్లు త్రిదండి చిన్న జీయర్ స్వామి ఓ ప్రకటనలో తాజాగా వెల్లడించారు.

ఈ నాలుగు రోజులు మండల అభిషేకాలు, ఆరాధన కార్యక్రమాలను రుత్వికులు నిర్వహిస్తారని.. వారికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన ప్రకటన చేశారు. ఏప్రిల్ 2వ తేదీన అంటే ఉగాది నుంచి ఎప్పటిలాగే భక్తులకు సందర్శన ఉంటుందని… ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి బుధవారం సెలవు ఉంటుందని.. గతంలో నిర్ణయించిన ప్రవేశ రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చినజీయర్ స్వామి వెల్లడించారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని… బయట నుంచి తీసుకువచ్చి ఆహారము, పానీయాలకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news