శాసనమండలి చైర్మన్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం…

-

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని విధంగా ఫలితాలు రావడంతో తేరుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ముఖ్యంగా ఈ ఫలితాలు దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలపై పడనుందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజలు ఇదే విధంగా గద్దె దించుతారని బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ఈయన మాట్లాడుతూ తెలంగాణాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ మరియు బీజేపీలు గెలిచే అవకాశం లేదని కొట్టిపారేశారు.

ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా సీఎం పదవి కోసం వాళ్ళల్లో వారే కొట్టుకునే పరిస్థితి నెలకొంది అన్నారు. ఇక స్వార్ధం కోసం మాత రాజకీయాలు చేసే బీజేపీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news