ఎస్‌బీఐ గుడ్ న్యూస్ .. రూ.25,000 భారీ డిస్కౌంట్ పొందే అవకాశం..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్న విషయం తెలిసిందే..పండుగ సందర్బంగా భారీ ఆఫర్లను అందిస్తుంది..క్రెడిట్ కార్డును వాడేవారు ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు..వివిధ రకాల బ్రాండ్లపై ఎస్‌బీఐ కార్డు కలిగిన వారు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఏ ఏ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

 

హోండా టూవీలర్స్ కొనుగోలుపై కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 40 వేలుగా ఉంటుంది. ఈఎం లావాదేవీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.. అదే విధంగా ఓయో బుకింగ్స్‌పై 10 శాతం అదనపు తగ్గింపు పొందొచ్చు. కార్డుపై రూ. 500 వరకు తగ్గింపు వస్తుంది. మంగళవారం, బుధవారం మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. మార్చి 29 వరకు ఆఫర్ ఉంటుంది..

వీ మార్ట్‌లో షాపింగ్ చేస్తే.. 5 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 4 వరకు అందుబాటులో ఉంటుంది..

ఒప్పొ ప్రొడక్టులకు కొనుగోలు చేస్తే.. రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలకు వర్తిస్తుంది. ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. శాంసంగ్ ప్రొడక్టులపై అయితే రూ. 25 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.మార్చి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది..

మేక్ మై ట్రిప్ ద్వారా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే.. 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 1200 వరకు తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్ మార్చి 30 వరకు ఉంటుంది.ఓన్లీ గురువారాలు మాత్రమే ఉంటుంది.

ఎల్‌జీ ప్రొడక్టుల కొనుగోలుపై అయితే 22.5 శాతం క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది..

అలాగే లాయిడ్ ప్రొడక్టులను కొనుగోలు చేస్తే 17.5 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. ఒక కార్డుపై గరిష్టంగా రూ. 4,500 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మార్చి చివరి వరకు ఆఫర్ ఉంటుంది.. ఇవే కాదు ఇంకా ప్రముఖ బ్రాండ్ లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది..ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..

 

Read more RELATED
Recommended to you

Latest news