తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల షెడ్యూల్

-

రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈనెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తామని కేబినెట్‌ తెలిపింది.

  • తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది.
  • సెప్టెంబర్ 16 వ తేదీన.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు.
  • సెప్టెంబర్ 17 ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు , మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • సెప్టెంబర్ 17 మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవనాల ప్రారంభోత్సవం. నెక్లెస్ రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు.
  • అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.
  • సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు. కవులు, కళాకారులను గుర్తించి సత్కారం. ఘనంగా తెలంగాణ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు

Read more RELATED
Recommended to you

Latest news