జగన్ రెడ్డి దద్దమ్మ కాబట్టే, పోలవరంపై చేతులెత్తేశాడు : దేవినేని ఉమ

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ సీనియర్ నేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి చేతగాని దద్దమ్మ కాబట్టే, పోలవరం పూర్తిచేయలేమని చేతులెత్తేశాడని విమర్శించారు. 72 శాతం పనులు చేసిన చంద్రబాబుకే ప్రాజెక్ట్ పూర్తిచేసే సత్తా, దమ్ము ఉన్నాయని స్పష్టం చేశారు దేవినేని ఉమ. 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 డిసెంబర్ అంటూ కబుర్లు చెప్పిన జగన్, చివరకు పోలవరాన్ని 2024 జూన్ నాటికి కూడా నిర్మించలేమని కేంద్రానికి లేఖ రాశాడని ఉమ ఎద్దేవా చేశారు. చేతిలో 30 మంది ఎంపీలను ఉంచుకొని ప్రాజెక్ట్ అంచనా వ్యయం (రూ.55.548కోట్లు) డీపీఆర్-2ని ఆమోదింపచేసుకోలేని అసమర్థుడిగా నిలిచిపోయాడని వ్యాఖ్యానించారు దేవినేని ఉమ.

YSRCP govt targeted BC leaders: Devineni Uma

అవినీతికోసం రాష్ట్ర రైతాంగాన్ని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ చెప్పాడని, పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ భాగోతం బయటపడిందని అన్నారు దేవినేని ఉమ. “కేసీఆర్ సామంతుడు కాబట్టే, జగన్ రెడ్డి పోలవరాన్ని పడుకోబెట్టాడు. లక్షా 6 వేల మంది నిర్వాసితులుంటే, వారికి పరిహారం తగ్గించవచ్చన్న ఆలోచనతో పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమయ్యాడు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఎన్నికల్లో డబ్బులిచ్చాడన్న కృతజ్ఞతతో పోలవరం ఎత్తు తగ్గించి, గొప్ప ప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మార్చాడు. కేసీఆర్ సామంతుడిగా మారిన జగన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 135 అడుగులుగా నిర్ధారించాడు” అని ఆరోపించారు దేవినేని ఉమ.

Read more RELATED
Recommended to you

Latest news